Tuesday, April 23, 2024

విద్యుత్ రంగం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా జహీరాబాద్ నియోజకవర్గంలోని పివిఆర్ గార్డెన్ పంక్షన్ హాల్‌లో విద్యుత్ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి విద్యుత్ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. నిరంతరాయంగా సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రభుత్వ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నదని గుర్తు చేశారు.

అటు వ్యవసాయానికి ఇటు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత సిఎం కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి మూల కారణం విద్యుత్ సౌకర్యమేనని విద్యుత్ సరఫరాపై తెలంగాణ రాష్ట్రం వెనక్కి తగ్గబోదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ రామకృష్ణరెడ్డి, మాజీ ఎంపిపి విజయ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్‌లు మంకల్ సుభాష్, మురళికృష్ణగౌడ్, సీనియర్ నాయకులు గోవర్దన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, పాండురంగారెడ్డి,

వైజ్యనాత్, బాసిత్, న్యాల్‌కల్ మండల వైస్ ఎంపిపి గౌసోద్దిన్, కేతకీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, మాజీ జడ్పిటిసి మానెమ్మ, పిఎసిఎస్ ఇప్పేపల్లి చైర్మన్ దాసరి మచ్చందర్, బిఆర్‌ఎస్ మొగుడంపల్లి మండల అద్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్‌ఎస్ జహీరాబాద్ పట్టణ అద్యక్షులు సయ్యద్ మొహియోద్దిన్, బిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు నారాయణ యాదవ్, నర్సింహరెడ్డి, విజేందర్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బంగారి సురేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్‌లు రాములు నేత, మోతిరాం, అబ్దుల్లా, జహంగీర్, రంగ అరుణ్‌కుమార్, నాయకులు ఇ జ్రాయేల్ బాబీ, రత్నం, అడిషనల్ డిఆర్‌డిఓ స్పెషల్ ఆఫీసర్ జగదీష్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు, విద్యుత్ అధికారులు, ఏఈ, డీలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News