Monday, June 9, 2025

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ ఛీప్‌ ప్రభాకర్‌రావు ఎట్టకేలకు విచారణకు హాజరయ్యాడు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి వచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావు ఏ1గా ఉన్నాడు. ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు దాదాపు 15 నెలల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చాడు. నిన్న రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ప్రభాకర్‌రావు.. ఇవాళ ఉదయం విచారణను ఎదుర్కొనేందుకు సిట్ కార్యాలయానికి వెళ్లాడు. ఈ కేసుతో సంబంధమున్న అందరినీ విచారించిన పోలీసులు.. ప్రధాన సూత్రధారి అయిన ప్రభాకర్‌ రావును ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉందని సిట్‌ అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News