Saturday, April 27, 2024

పదోన్నతి బాధ్యతను పెంచుతుంది

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: పదోన్నతి బాధ్యతను పెంచుతుందని భూపాలపల్లి జిల్లా ఎస్‌పి జె సురేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఇన్స్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన జానీ నరసింహులు, బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌పి జె సురేందర్‌రెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.

ఈ సందర్భంగా పదోన్నతి ఇన్స్‌స్పెక్టర్ నరసింహులుకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌పి మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదోన్నతి అనేది మరింత బాధ్యతను పెంచుతుందని, నిజాయితీగా, అంకితభావంతో పనిచేస్తూ పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News