Saturday, July 27, 2024

ప్రజా సంక్షేమమే బిఆర్‌ఎస్ పార్టీ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మణుగూరు: నిత్యం ప్రజల మధ్య ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అదే విధంగా ప్రభుత్వ పథకాలను గ్రామాలలోని ప్రజలకు వివరించాలని, పినపాకి నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ బాధ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న వారిని నేరుగా కలిసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.

కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్ష పార్టీలు ప్రజల వద్దకు వస్తూ ఉంటారని, బిఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఎల్లవేళలా ప్రజలలో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంపచుకుందని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని కార్యకర్తల కృషితోనే తెలంగాణ ఏర్పాటుతో పాటు అధికారం దక్కించుకున్నదన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలు వారికి పకడ్బందీగా అందేలా కృషి చేయాలని సూచించారు. పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, పార్టీ బాధ్యలు ముఖ్యులంతా నిత్యం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను చేరవేయాలని, అన్ని గ్రామాలలో పార్టీ నిర్మాణం ధృఢంగా ఉండేలా పార్టీలోని అన్ని భాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల వారిగా ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్దిదారులు జాబితాను రూపొదించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు.

పినపాక నియోజకవర్గంలోని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేసుబుక్, వాట్సప్ వంటి వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకొని ప్రభుత్వ పథకాలు అభివృద్ది పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామం నుండి సోషల్ మీడియాలో బలోపేతానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలన్నారు. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

రానున్న రోజులలో మరింత అభివృద్ధి పథంలో నిలబెడతానని, అన్ని గ్రామాలలో డ్రైన్లు సీసీ రోడ్లు నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు అందజేస్తుందని, కోట్లాది రూపాయలు నిధులు ప్రభుత్వం నుండి మంజూరు అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఏజెన్సీ గ్రామానికి బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్ధానంలో ఉండేలా చూస్తానని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News