- Advertisement -
ఐపిఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించింది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగింది. ఇక పంజాబ్ ఈ సీజన్లో ఆరో విజయంతో నాకౌట్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 190 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
- Advertisement -