- Advertisement -
అహ్మదాబాద్: ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరుకుంది. క్వాలిఫయర్ 2లో ముంబయిపై పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచింది. పంజాబ్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 87 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబయి బౌలర్లు దారుళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఓటమిని చవిచూశారు. ముంబయి కెప్టెన్ పాండ్యా సరైన సమయంలో స్పిన్ బౌలింగ్ ఉపయోగించుకోలేదని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. శాంట్నార్ తో మరో రెండు ఓవర్లు వేయించి ఉంటే బాగుండేదని క్రికెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
- Advertisement -