- Advertisement -
అహ్మదాబాద్: ఐపిఎల్ 18వ సీజన్లో అతిపెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(RCB) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ (PBKS) గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు. దీంతో ఈసారి ట్రోఫీని అందుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. క్వాలిఫయర్-1లో ఫంజాబ్ని చిత్తుగా ఓడించి ఆర్సిబి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో భారీ స్కోర్ సాధించి విజేతగా నిలవాలని బెంగళూరు భావిస్తోంది. మరోవైపు క్వాలిఫయర్-1కి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు.. ట్రోఫీని అందుకోవాలని పంజాబ్ వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్లో రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
- Advertisement -