Thursday, May 22, 2025

పేద యువతకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

- Advertisement -
- Advertisement -

ఏఐ -ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్ మరియు డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ అగ్రగామి అయిన క్వాలిజీల్, నిర్మాన్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ఒక ముఖ్యమైన సీఎస్ఆర్ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించినట్లు నేడు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, క్వాలిజీల్ హైదరాబాద్‌లోని పేద యువతకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసింది, ఇది సమ్మిళిత అభివృద్ధి , డిజిటల్ సాధికారత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది.

ఈ కార్యక్రమం రెండు సంస్థల సీనియర్ నాయకత్వం సమక్షంలో జరిగింది. వెనుకబడిన సమాజాల్లోని వ్యక్తుల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, వారి విద్య , వృత్తిపరమైన ప్రయాణాలను ప్రోత్సహించగల సాంకేతికతకు అవకాశాలను అందించటం ఈ కార్యక్రమం చేస్తోంది.

ఈ కార్యక్రమంలో క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు & భారత కార్యకలాపాల అధిపతి మధుమూర్తి రోణంకి మాట్లాడుతూ, “క్వాలిజీల్‌ వద్ద, సాంకేతికత ఒక అవరోధంగా కాకుండా అనుసంధానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా, ఉత్సుకతను రేకెత్తించడం, అవకాశాలను అందించడం , ప్రాధమిక స్థాయి నుండి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను ప్రోత్సహించటం చేయాలని మేము కోరుకుంటున్నాము ” అని అన్నారు.

నిర్మాన్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యాల అధిపతి నిఖిల్ గంపా మాట్లాడుతూ, “క్వాలిజీల్‌తో ఈ భాగస్వామ్యం ఒక విరాళం కంటే ఎక్కువ. ఇది యువత సామర్థ్యం పై పెట్టుబడి. మా లబ్ధిదారులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు క్వాలిజీల్‌కు కృతజ్ఞులం” అని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News