Thursday, May 22, 2025

పహల్గాం ఉగ్ర దాడి హతుని కుటుంబానికి రాహుల్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది వ్యక్తుల్లో ఒకరైన శుభం ద్వివేది కుటుంబ సభ్యులను కాన్పూర్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. రాహుల్ గాంధీ అమేథి నుంచి కాన్పూర్‌కు చేరుకుని ద్వివేది ఇంటికి వెళ్లారు. ఆయన ద్వివేదికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం రాయబరేలి, అమేథిలలో రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. ఆయన వెంట యుపి కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఉన్నారు. అజయ్ రాయ్ గత బుధవారం (23న) ద్వివేది అంత్యక్రియలకు హాజరయ్యారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ద్వివేది కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి 23న కాన్పూర్ సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News