Thursday, April 25, 2024

ఇంట్లోకి చొరబడి దళిత మహిళపై అఘాయిత్యం… కెమికల్ చల్లి… తగలబెట్టారు

- Advertisement -
- Advertisement -

జైపూర్: దళిత మహిళపై అత్యాచారం చేసి అనంతరం ఆమెపై కెమికల్ చల్లి తగలబెట్టిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బర్మార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షాకూర్ ఖాన్ అనే వ్యక్తి దళిత మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెపై కెమికల్ చల్లి తగలబెట్టాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు మంటలను ఆర్పి బలోట్రాలోని నహటా ఆస్పత్రికి తరలించారు. 40 శాతం గాయపడడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పచ్ పద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాకూర్ ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News