Friday, April 26, 2024

ఐపిఎల్ 2023సీజన్ ఆరంభానికి ముందు ఆర్‌సిబి జట్టుకు ఎదురుదెబ్బ..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్ 2023సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్, కీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ గాయాలతో జట్టుకు దూరం కానున్నారు. ఆసీస్ స్టార్ పేసర్ హాజిల్‌వుడ్ మడమ సమస్య కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వనున్నాడని సమాచారం. మరోవైపు మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ సైతం మడమ గాయం కారణంగా ఐపిఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. కాగా ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్‌సిబి టైటిల్‌వేటను ప్రారంభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News