అమరావతి: తనపై, తన భార్యపై రేషన్ బియ్యం కేసు పెట్టారని ఎపి మాజీ మంత్రి పేర్నినాని (perni nani) అన్నారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సివిల్ సప్లై చరిత్రలో తనపై తప్ప.. ఎవరిపైనా కేసులు లేవని తెలిపారు. తన భార్యను విచారణకు పిలిచి సిఐ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఆవేదనను వ్యక్తం చేశారు. గిలకలదిండిలో 15,400 మందికి ఇళ్ల పట్టాలు కమిషనర్, ఎమ్మార్వో సమక్షం (presence MRO) లోనే ఇళ్ల పట్టాలు ఇచ్చామని అన్నారు. ఎమ్మార్వోకు తెలియకుండా సైన్ పెట్టారని ఎలా చెప్పారు? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాస్తోందని, నకిలీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఏ రోజూ పాపపు సొమ్ము గడప దాటి ఇంట్లోకి వెళ్లలేదని, ఏ అధికారంతోనూ తప్పుడు పని చేయించలేదని పేర్కొన్నారు. ఏ కేసు పెట్టుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమని పేర్ని నాని సవాల్ విసిరారు.
మా పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: పేర్ని నాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -