Friday, May 30, 2025

క్వాలిఫయర్-1: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముల్లాన్‌పూర్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో(PBKS) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ‌లో విజయం సాధించి నేరుగా ఫైనల్స్‌కి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ప్రత్యర్థి జట్టును స్వల్పస్కోర్‌కే పరిమితం చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని చేధించాలని ఆర్‌సిబి భావిస్తోంది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ చేసి.. ఆర్‌సిబిని రెండో ఇన్నింగ్స్‌లో కట్టడి చేసి.. విజయం సాధించాలని పంజాబ్ వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఆర్‌సిబి జట్టులోకి హేజెల్‌వుడ్ రాగా.. పంజాబ్ జట్టులో మార్కో జెన్సన్ స్థానంలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ని జట్టులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News