ఐపిఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) ఫైనల్స్కి చేరింది. దీంతో కలిపి మొత్తం నాలుగుసార్లు ఫైనల్స్కు వెళ్లిన ఆర్సిబి ఈసారి కప్పు కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. గురువారం పంజాబ్ కింగ్స్ని మట్టికరిపించి ఫైనల్స్కు చేరిన ఆర్సిబి పలు రికార్డులను (Record) తమ ఖాతాలో వేసుకుంది.
మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఈ స్వల్పలక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఆర్సిబి చేధించింది. దీంతో ఫైనల్స్కి సునాయాసంగా చేరిన ఆర్సిబి (RCB) కొన్ని రికార్డులు సాధించింది. ఐపిఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ప్రత్యర్థి జట్టును 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సిబి నిలిచింది. ఇప్పటివరకూ ఏ జట్టు ఈ రికార్డును సాధించలేదు.
దీంతో పాటు ఐపిఎల్ ప్లేఆఫ్స్లో బంతుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా బెంగళూరు రికార్డుల్లోకెక్కింది (Record). ఈ మ్యాచ్లో 60 బంతులు మిగిలి ఉండగానే ఆర్సిబి విజయం సాధించింది. గతంలో ఈ రికార్డు కోల్కతా నైట్రైడర్స్ పేరిట ఉండేది. ఐపిఎల్-2024 ఫైనల్లో సన్రైజర్స్పై కోల్కతా 57 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.