అహ్మదాబాద్: ఐపిఎల్ 18వ సీజన్ ఫైనల్ (IPL Final) మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఔట్ అయ్యాడు. అర్షదీప్ వేసిన మొదటి ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.
ఆ తర్వాత జెమీసన్ వేసిన ఓవర్లో ఒక ఫోర్ కొట్టిన సాల్ట్ ఓవర్లోని నాలుగో బంతిని మిడ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, శ్రేయస్ అయ్యర్ ఆ బంతిని ఫీల్డింగ్ పోజిషన్ నుంచి చాలా దూరం వెనక్కి వెళ్లి మరీ అందుకున్నాడు. దీంతో ఫిల్ సాల్ట్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఐపిఎల్ ఫైనల్లో (IPL Final) 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సిబి (RCB) 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజ్లో విరాట్ (7), మయాంక్ (14) ఉన్నారు.