Sunday, June 1, 2025

‘అలా జరిగితేనే ఆర్‌సిబి కప్పు గెలుస్తుంది..’: అశ్విన్

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరింది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఆర్‌సిబి దూకుడుగానే ఆడుతుంది. క్వాలిఫయర్-1లో కూడా పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో ఫైనల్స్‌లో ఆర్‌సిబితో తలపడే జట్టు ఏదా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే అర్‌సిబి కప్పు గెలవాలంటే ముంబై ఇండియన్స్ మాత్రం ఫైనల్స్‌కి రావొద్దని టీం ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అభిప్రాయపడ్డారు. ముంబై ఒకవేళ ఫైనల్స్‌కి వస్తే.. వాళ్లు ఆరోసారి కప్పు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. ఆర్‌సిబి టైటిల్ గెలవాలంటే.. మరికొన్ని గంటల్లో జరిగే ఎలిమినేటర్‌లో గుజరాత్ ముంబైని ఓడించాలని అశ్విన్ పేర్కొన్నారు. ఒకవేళ తానే ఆర్‌సిబి ఆటగాడు అయితే.. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్స్ ఆడాలని కోరుకుంటానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News