Monday, May 20, 2024

జీవన్‌రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపి టికెట్ ఇచ్చారు:రేణుకాచౌదరి

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డిపై సొంత పార్టీ నేత రేణుకాచౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ జీవన్ రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపి టికెట్ ఇచ్చారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపి టికెట్ మండవ వెంకటేశ్వరరావుకు ఇస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. మండవ స్థానికుడని ఆయన్ను ఖమ్మం నుంచి పోటీ చేయించాలనుకుంటే కార్యకర్తలు ఒప్పుకోలేదని ఆయన గుర్తుచేశారు.

జీవన్ రెడ్డికి రెండు సీట్లు కేటాయించినట్లు అయిందని ఆమె అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం స్థానం నుంచి మండవ వెంకటేశ్వరరావును బరిలోకి దించాలని భావించినా చివరికి పొంగులేటి వియ్యంకుడు రామ సహాయం రఘురామరెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సీటు నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, పొంగులేటి సోదరుడు పేరు ప్రముఖంగా వినిపించిన కాంగ్రెస్ మాత్రం రఘురామిరెడ్డి పేరును ఫైనల్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News