Thursday, March 28, 2024

ఆదానీ సంస్థ అక్రమాలపై కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదు : రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆదానీ సంస్థ అక్రమాలపై కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదానీ కంపెనీపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జెపిసి వేసి విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందన్నారు. ఆదానీపై హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ రాకుండా విపక్షాల గొంత నొక్కే ప్రయత్నం మోడీ సర్కార్ చేసిందని విమర్శించారు. ఆదానీ అంశంపై ఇడికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎంపిలను పోలీసులతో మోడీ సర్కార్ అడ్డుకుందని చెప్పారు.

అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన సంస్థపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎంపిలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. దీని వెనుక ఉద్దేశ్యం బయటపెట్టాలని బిజెపిని డిమాండ్ చేశారు. యూపిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బొగ్గు కుంభకోణం, 2జి కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణాలపై జెపిసి ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై పోరాటం చేసినట్టుగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News