Thursday, June 26, 2025

హాలీవుడ్‌లోకి ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తున్నారు. వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీలంకలో చిత్రీకరించబడింది. ‘రిజానా – ఎ కేజ్‌డ్ బర్డ్’ అనే ఈ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి వరలక్ష్మి మాట్లాడుతూ “ఆస్కార్ అవార్డు (Oscar Award) గెలుచుకున్న జెరెమీ ఐరన్స్ వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల నెరవేరినట్టు అనిపిస్తోంది. చంద్రన్ రత్నం దర్శకత్వంలో పనిచేయడం కూడా నాకు గర్వకారణం. శ్రీలంకలోనే కాదు, ప్రపంచ సినిమాకే ఆయన కొత్త దారులు చూపిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన అంతర్జాతీయ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు ఆనందంగా ఉంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News