Saturday, May 24, 2025

రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Rohit Sharma has tested positive for Covid-19

 

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. శనివారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో రోహిత్ శర్మకు కరోనా సోకినట్లు తెలింది. బిసీసీఐ వైద్యబృందం ఆయనను ఐసోలేషన్ లో ఉంచి పర్యవేక్షిస్తోంది. దీంతో జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టుకు భారత్ కు భారీ ఎదురు దెబ్బ తాకిందనే చెప్పాలి. హార్దిక్ పాండ్య సారథ్యంలో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. అటు రోహిత్ అభిమానులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు రోహిత్ ప్రస్తుతం లీసెస్టర్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో గురువారం తొలి ఇన్నింగ్స్ లో బ్యాంటింగ్ చేసి 25 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కు పాజిటివ్ తేలడంతో ఇరు జట్లులో ఒక్కాసారిగా ఆందోళన మొదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News