Tuesday, April 30, 2024

బీహార్‌లో యాక్సిస్ బ్యాంకులో రూ. కోటి లూటీ

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ లోని వైశాలి జిల్లాలో మంగళవారం ఉదయం యాక్సిస్ బ్యాంకులో రూ. కోటి లూటీ జరిగింది. జిల్లా లాల్‌గంజ్ బ్లాక్ లోని టీన్‌పుల్వా చౌక్‌లో యాక్సిస్ బ్యాంకు లోకి నలుగురు దొంగలు ప్రవేశించి తుపాకులతో బ్యాంకు ఉద్యోగులను, ఖాతాదారులను బెదిరించి నగదు దోచుకెళ్లారు. సీసీటీవీ కెమెరాకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను కూడా ఎత్తుకెళ్లారు. పోలీస్‌లు రంగం లోకి దిగి నలుగురిలో ఒక దొంగ బ్యాంకు బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News