- Advertisement -
ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్ నుంచి రూ. 5 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించిన ఎసిబి, లోతైన దర్యాప్తు కోసం నూనె శ్రీధర్ను ఐదు రోజుల కస్టడికి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం నాలుగో రోజు ఎసిబి అధికారులు శ్రీధర్ను విచారించారు.
ఈ విచారణలో ఎస్బిఐ బ్యాంకులో ఉన్న శ్రీధర్ లాకర్లును తెరవగా, రూ. 5 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగానే ఈ అవినీతి వ్యవహారాలు బయటపడుతున్నట్లు సమాచారం. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బదిలీ అయినప్పటికి ఏడాది పాటు అక్కడే ఉద్యోగం చేయడం పట్ల ఎసిబి దృష్టి సారించింది.
- Advertisement -