Saturday, April 27, 2024

కవిత అరెస్టుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్.. గుండుబాస్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ చీఫ్, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం అన్నారు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు.

కెసిఆర్ తెలంగాణలో బిజెపి కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశాడని ఆయన ఆరోపించారు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదన్నారు. ఈ లాంటి అక్రమ అరెస్ట్ ల తో అదిరేది బెదిరేది లేదని హెచ్చరించారు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమేనని ఆయన వెల్లడించారు.

ఈడీ తో బిజెపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. దేశంలో మోడి పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉందని మండిపడ్డారు. మొన్న  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…? అన్నారు. అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీ-కాంగ్రేసులను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవితకు ముడుపులు ముట్టినట్లు ఈడీ వద్ద సాక్ష్యాలున్న ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రవీణ్ కుమార్ 2023లో ట్వీట్ చేసినట్లు కాంగ్రెస్ ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. బిజెపితో కెసిఆర్ చీకటి ఒప్పదం కుదుర్చుకున్నారని ఆరోపించినట్లు చెబుతున్నారు. ఇప్పడు బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోగానే అరెస్టును ఖండిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఢిల్లీ మద్యం కేసులో నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన ఈడీ ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News