- Advertisement -
భువనేశ్వర్: తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడంతో ఐదుగురు రోగులు మృతి చెందారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో (Sahid Laxman Naik Medical College and Hospital) రోగులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి ఐసియు, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులకు తప్పుడు ఇంజక్షన్లు వేయడంతో అక్కడే వారు కన్నుమూశారు. రెండు రౌండ్లు ఇంజక్షన్లు వేయడంతోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. ఆస్ప్రతి ముందు మృతుల బంధువులు, రోగులు ధర్నాకు దిగారు.
(Sahid Laxman Naik Medical College and Hospital)
- Advertisement -