Sunday, April 28, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ సమంత శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు, అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సమంతను ఆశీర్వదించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన సమంతను చూసిన అభిమానులు దగ్గరకు వచ్చి పలకరిస్తూ, ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అదేవిధంగా సమంతతో పాటు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ, మరో యాక్టర్ నాగ మహేశ్, కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News