- Advertisement -
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎధురుచూస్తున్నాడు హీరో శర్వానంద్. గత ఏడాది ‘మనమే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వాకు ఆ సినిమా నిరాశే మిగిల్చింది. అయితే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు శర్వా. తాజాగా తన 38వ సినిమా టైటిల్ను చిత్ర బృందం ప్రకటించింది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు.
ఇందుకు సంబంధించి ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ గ్లింప్స్ని కూడా విడుదల చేశారు. దీన్ని సంపత్ నంది షేర్ చేస్తూ.. ‘ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది. ప్రతి పండుగకు ఓ ప్రయోజనం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్స్పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Advertisement -