Friday, April 19, 2024

గిల్, ధావన్ ఔట్

- Advertisement -
- Advertisement -

క్రైస్ట్‌చర్చ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో టీమిండియా 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ 13 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో శాంట్నార్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శిఖర్ ధావన్ 28 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(25), రిషబ్ పంత్(04) బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News