- Advertisement -
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రం కోసం వాస్తవ ఘటనల ఆధారంగా అద్భుతమైన కథను సిద్దం చేశాడు గోపీచంద్ మలినేని. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ సరసన హీరోయిన్గా శృతీ హాసన్ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
- Advertisement -