Tuesday, June 3, 2025

ఓటిటిలోకి ‘శుభం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ స‌మంత నిర్మాతగా వచ్చిన తొలి చిత్రం ‘శుభం’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి ప్రధాన పాత్రల్లో నటించారు. మే 9న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. చిన్న మూవీగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ జూన్‌ 13 నుంచి ఓటిటి ప్లాట్ ఫామ్ జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంస్థ పోస్టర్‌ విడుదల చేసింది. ‘చచ్చినా చూడాల్సిందే’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News