Monday, April 29, 2024

భారత్ కెనడా స్నేహం ఛిన్నాభిన్నం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కెనడాలో అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉండటంతో ఖలీస్థానీల పట్ల కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగలేకపోవడం, నేతలు బహిరంగంగానే ఖలీస్థానీవాదులకు మద్దతు ప్రకటించడం సంక్లిష్ట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య విద్యాకార్యకలాపాలపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపింది. ఈ మధ్యకాలంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు , ఐటి యువత ఎక్కువగా కెనడాకు వెళ్లుతున్నారు. వీసాల నిబంధనలు సరళీకృతంగా ఉండటంతో కెనడానే కార్యస్థలిగా ఎంచుకుంటున్నారు. అక్కడ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలతో పాటు ఉంటున్న పలు భారతీయ కుటుంబాలు ఇప్పుడు ఎప్పుడు ఏమమవుతుందో అనే ఆందోళనలో పడ్డాయి. కాగా కెనడా ఇండియాల మధ్య చిరకాలంగానే విద్యాపరంగా బలీయ సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య దాదాపు 200 విద్యాసంస్థలలో పరస్పర భాగస్వామ్యం ఉంది.

ఇది కాకుండా కెనడాలో 3.18 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులలో అత్యధికం భారతీయులే ఉన్నారు. విదేశీ విద్యార్థులలో 20 శాతం వరకూ భారతీయ విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. 2022 23 నాటికి 8.16 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు అయింది. భారత్ నుంచి కెనడాకు ఔషధాలు, రత్నాలు, ఆభరణాఉల , టెక్స్‌టైల్స్ ఎగుమతి అవుతాయి. కెనడా నుంచి భారతదేశానికి పప్పుడు , కలప, కాగితం, మైనింగ్ ఉత్పత్తులు వస్తాయి. విశేష రీతిలో ఇరుదేశాలు ఎప్పుడు కూడా ఏక వస్తువుల తయారీకి దిగకుండా అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తుల మధ్య పోటీ లేకుండా చూసుకుంటూ వస్తున్నాయి. అయితే ఇటీవలి పరిణామాలతో ఈ విద్యా వ్యాపార వాణిజ్య రంగాల విషయంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే పరిస్థితి ఏర్పడిందని వెల్లడైంది. ఇప్పటికైనా దీనిని సరిదిద్దే దిశలో చర్యలు తీసుకోకపోతే పరిణామాలు మరింత తీవ్రం అవుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News