సిట్ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు
వైఎస్ షర్మిల కాల్స్ రికార్డు.. అన్నకు సమాచారం
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు అత్యధికంగా
ఫోన్లు ట్యాప్ అస్మదీయ, తస్మదీయ నేతలపైనా నిఘా
ప్రతిపక్షనేతలు, రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు
సినీస్టార్ల ఫోన్లు ట్యాప్ ఆ సమాచారంతోనే
పొంగులేటి, రాజగోపాల్రెడ్డి డబ్బులు స్వాధీనం
చేసుకున్నట్లు గుర్తించిన సిట్ ట్యాపింగ్ కోసం
ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభాకర్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యా ప్తు కొనసాగుతోంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికలకు రెండు నెలల ముందు అధిక సం ఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ గు ర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వె య్యి మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ట్లు ఈ విచారణలో గుర్తించారు. రాష్ట్రం లో వెయ్యి మంది ఫోన్లను ట్యాప్ చేసిన ట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు స మాచారం. అయితే ఇప్పటివరకు పూర్తి గా సాంకేతికంగా, శాస్త్రీయంగా విశ్లేషిం చి 600 ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు లో పోలీసులు నిర్థారించినట్లు తెలిసిం ది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, ప్రతిపక్ష నేతలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు.
మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ విచారణలో తేలింది. సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టులు క్రియాశీలకంగా మారారని చెప్పి, వారి కదలికలపై నిఘాకు అనుమతి కోరినట్లు రివ్యూ కమిటీ ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలిసింది. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు తేలింది. హవాలా నిధులు మావోయిస్టులకు చేరవేస్తున్నారన్న సాకుతో వ్యాపారస్థుల నుంచి కోట్ల రూపాయిలు అనధికారికంగా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. సాధారణంగా పోలీసులు నగదు, ఇతర వస్తువులు ఏదైనా అధికారికంగా స్వాధీనం చేసుకుంటే ట్రెజరీకి జమ చేసి న్యాయస్థానానికి సమాచారం అందజేయాల్సి ఉంంటుంది. కానీ ఈ వ్యవహారంలో పూర్తిగా అనధికారికంగా కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని తమ సొంత అవసరాలకు వినియోగించినట్లు సమాచారం.
అత్యంత గోప్యంగా షర్మిల ఫోన్లు ట్యాప్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు…అందుకు సంబంధించిన ప్రతి అంశం తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక నేతకు సమాచారం చేరవేసి, ఆయన ద్వారా నాటి ఎపి సిఎం, ఆమె సోదరుడు వైఎస్ జగన్ను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా షర్మిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిసింది. షర్మిల కోసం ప్రత్యేకంగా కోడ్ భాషను వినియోగించినట్లు సమాచారం. అయితే తన ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయాన్ని వైఎస్ షర్మిల గుర్తించారు. అయితే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని, ఈ అంశంపై బుధవారం స్పందిస్తానని ఆమె మీడియాకు వెల్లడించారు. ఫోన్ ట్యాప్కు గురైన ముఖ్యనేతలలో అప్పటి టిపిసిసి ఛీఫ్ రేవంత్రెడ్డి, అప్పటి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్, అప్పటి కాంగ్రెస్ వార్రూమ్ ఇంచార్జి మల్లురవి, ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోల్తోపాటు బిజెపి నేతలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్రావు ఉన్నట్లు తెలిసింది.
వాంగ్మూలం ఇస్తున్న ఫోన్ ట్యాపింగ్ బాధితులు
ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. అందులో భాగంగా టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. అలాగే గద్వాల కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య కూడా తమ వాంగూల్మం ఇచ్చారు. ఈ ట్యాపింగ్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో సిట్ అధికారులకు వారు వివరించారు. సిట్ విచారణలో బాధితులు చెప్పిన
వివరాల మేరకు ప్రభాకర్రావుతో పాటు నలుగురు నిందితులను కూడా కలిపి విచారించాలని సిట్ భావిస్తోంది. ప్రతి రోజు ప్రభాకర్రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చే వారని నలుగురు నిందితులు సిట్ అధికారులకు తెలిపారు. పోల్ -2023 వాట్సాప్ గ్రూప్పై ప్రధానంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించనుంది. అప్పటి టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డికి సన్నిహితులు గాలి అనిల్, వినయ్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుపై కూడా సిట్ ఆరా తీసింది. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్కు చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. 2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో బిఆర్ఎస్ నేతలు,ఎంఎల్ఎల కూడా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.
వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చేవారని తేలింది. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ ఇచ్చారని… భుజంగరావు, తిరుపతన్న నేరుగా బిఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను ఎప్పటికప్పుడు వివరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, దానిని ఒఎస్డి రాధా కిషన్ రావును ప్రభాకర్ రావు ఉపయోగించుకున్నట్లు సమాచారం. డబ్బులు ఎవరైనా తీసుకువెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి మరీ అధికారులు పట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రభాకర్రావు నుంచి కీలక విషయాలను రాబట్టిన అధికారులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే అందులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు యుఎస్ వెళ్లిపోయారు. దీంతో ఆ అంశంలో మిగిలిన అధికారుల ప్రమేయాన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఈ విధంగా వ్యవహరించామని సిట్ అధికారుల ఎదుట వారు స్పష్టం చేశారు. దీంతో యుఎస్లోని ప్రభాకర్ రావును భారత్కు రప్పించే ప్రయత్నం చేశారు. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలతో ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చి.. సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారుల విచారణలో తొలుత ఆయన ప్రశ్నలను దాట వేసినట్లు సమాచారం. అనంతరం వరుసగా జరిగిన విచారణలో ఆయన నుంచి సిట్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.