కొలంబో: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 79.3 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. తైజుల్ ఇస్లాం (33), నయీం హసన్ (25), ఓపెనర్ షద్మన్ ఇస్లామ్ (46), లిటన్ దాస్ (34), రహీం (35), మెహదీ హసన్ (31) పరుగులు చేశారు. ఆతిథ్య జట్టు బౌలర్లలో అసితా ఫెర్నాండో, సోనల్ దినుషా మూడేసి వికెట్లను తీశారు. విశ్వ ఫెర్నాండోకు రెండు వికెట్లు లభించాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంకకు ఓపెనర్లు పాథుమ్ నిసాంకా, లహిరు ఉడారా శుభారంభం అందించారు. లహిరు 4 ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండీమల్ 10 ఫోర్లు, ఒక సిక్స్తో 93 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాథుమ్ నిసాంకా 238 బంతుల్లో 18 ఫోర్లతో 146 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి ప్రభాత్ జయసూర్య (5) అండగా ఉన్నాడు. కాగా, లంక ఇప్పటికే 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
నిసాంకా అజేయ శతకం.. శ్రీలంక 290/2
- Advertisement -
- Advertisement -
- Advertisement -