- Advertisement -
ముక్కోణపు సిరీస్
కొలంబో: శ్రీలంకతో ఆదివారం జరిగే ముక్కోణపు మహిళల సిరీస్ ఫైనల్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో గెలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. లీగ్ దశలో భారత్పై సంచలన విజయం సాధించిన లంక కూడా జోరుమీదుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్లో లంక సమరోత్సాహంతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు లీగ్ దశలో లంక చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షంతో భారత్ పోరుకు సిద్ధమైంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
- Advertisement -