Friday, April 19, 2024

ఉల్లిపిట్టలో తండ్రిని చంపిన కుమారులు

- Advertisement -
- Advertisement -

Sons killed father for not distributing property properly

 ఉల్లిపిట్ట: కొమురం భీం అసీఫాబాద్ జిల్లా ఉల్లిపిట్టలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ఆస్తి సరిగా పంచలేదని కన్నతండ్రిని కుమారులు హత్య చేశారు. మృతుడిని మల్లయ్య (72)గా గుర్తించారు. కుమురుంభీం జిల్లా తిర్యాని మండలం ఉల్లిపిట్టలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News