Saturday, May 4, 2024

కాచిగూడ టు- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

వేసవి రద్దీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్ల పొడిగింపు

హైదరాబాద్: కాచిగూడ టు- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రైలు నెం. 07417 మే 13వ తేదీ రాత్రి 8:45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మే 14వ తేదీ ఉదయం 8.40 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

రైలు నెం. 07418 మే 14వ తేదీ రాత్రి 9.55 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి, మే 15 ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయన పాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగు తాయి. ఈ రైళ్లలో ఎసి II టైర్, ఎసి III టైర్, స్లీపర్ III టైర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. వేసవి రద్దీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News