Saturday, June 28, 2025

చంద్రబాబు బనకచర్ల అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు: శ్రీకాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: సంక్షేమాన్ని గాలికొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి పేరుతో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటికే లక్షా 60 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చారు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని, రాయలసీమ ప్రజలను ఊరించడానికే బనకచర్ల ప్రాజెక్టు అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News