Wednesday, April 24, 2024

లక్కీ బ్యూటీకి బిగ్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

సినీ ఇండస్ట్రీలో కొందరికి అదృష్టం ఒక్కసారిగా కలిసివస్తుంది. ఒక్క సినిమాతోనే అనేక చిత్రాలు పొందిన బ్యూటీ శ్రీలీలని చూస్తే అదే అనిపిస్తుంది. ఇప్పటికే రవితేజ సరసన ‘ధమాకా’ వంటి పెద్ద సినిమాలో ఛాన్స్ పొందిన ఈ సుందరికి ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సరసన నటించే అవకాశం వచ్చిందిట. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చే నెలలో ప్రారంభం కానున్న సినిమాలో ఆమెని రెండో హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం.

మెయిన్ హీరోయిన్‌గా పూజ హెగ్డే నటించనుంది. ఇక త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఇంతకు ముందు అతడు, ఖలేజా వచ్చాయి. ఇప్పుడు వస్తున్న ఈ మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్‌లో మొదలై 5 రోజుల పాటు షూటింగ్ చేసిన తర్వాత సినిమాని తాత్కాలికంగా ఆపారు. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి చనిపోవడం, ఇటీవల తండ్రి కృష్ణ కన్నుమూయడంతో మళ్ళీ షూటింగ్ మొదలు కాలేదు. ఇక ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ పాత కథని చాలావరకు మార్చేశాడట. కథలో మార్పులు జరగడంతో రెండో హీరోయిన్ కి చోటు దక్కింది. అలా శ్రీలీలకి ఇంత పెద్ద ఆఫర్ వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News