Wednesday, May 1, 2024

శ్రీనిధి కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగర శివారు ఘట్‌కేసర్ శ్రీనిధి కాలేజీ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో శ్రీనిధి కాలేజీ వద్దకు భారీగా పోలీసులు తరలివచ్చారు. మోసపూరితంగా యూనివర్సిటీ పేరుతో అడ్మిషన్లు తీసుకున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలోకి విద్యార్థులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన యాజమాన్యం పట్టించుకోలేదని మండిపడ్డారు. అయితే తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నప్పటికీ శ్రీనిధి కాలేజీ వద్ద యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News