Friday, August 15, 2025

నేను జగన్ వెంటే ఉంటాను: సుచరిత

- Advertisement -
- Advertisement -

అమరావతి: పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని ఎంఎల్ఎ, మాజీ మంత్రి సుచరిత తెలిపారు.గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారితే తాను ఇంటికే పరిమితమవుతానని వివరించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం సిఎం జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుచరిత పేర్కొన్నారు. ఎవరూ తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుందని, పోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News