Sunday, April 28, 2024

ఆప్ అభ్యర్థే చండీగఢ్ మేయర్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ మేయర్ గా ఆప్ అభ్యర్థి విజయం సాధించినట్లు సుప్రీంకోర్టు ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని పేర్కొంది. రిటర్నింగ్ అధికారి చెల్లుబాటు కావంటూ పేర్కొన్న ఎనిమిది ఓట్లూ చెల్లుతాయని చెప్పిన సుప్రీంకోర్టు, తిరిగి రీకౌంటింగ్ జరపాలని ఆదేశించింది. ఈమేరకు రీకౌంటింగ్ లో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ గెలిచినట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

చండీగఢ్ మేయర్ ఎన్నికకు జనవరి 30న పోలింగ్ జరిగింది. బిజేపి అభ్యర్థికి 16 ఓట్లు రాగా, ఆప్, కాంగ్రెస్ ల తరపున బరిలోకి దిగిన ఉమ్మడి అభ్యర్థికి 20 ఓట్లు వచ్చాయి. అయితే ఉమ్మడి అభ్యర్థికి పోలైన ఓట్లలో ఎనిమిది ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి పేర్కొనడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై ఆప్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయనీ, రీపోలింగ్ జరపాలని కోరింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.

బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ మార్క్ ఎందుకు వేశారని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ను బెంచ్ నిలదీసింది. అప్పటికే చెల్లుబాటు కాని బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ గుర్తు వేశానని, ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై అలా వేశాననీ ఆయన అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News