Monday, May 6, 2024

దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్‌కు కుదిరిన ముహూర్తం

- Advertisement -
- Advertisement -

T-Hub 2.0 to be inaugurated on June 28

అందుబాటులోకి రానున్న టి…హబ్ రెండవ దశ
ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టి..హబ్ రెండవ దశ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 28వ తేదీన అట్టహాసంగా ప్రారంభంకానుంది. టిఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో మాదాపూర్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటిలో మూడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని నిర్మాణాన్ని చేపట్టారు. మూడెకరాల విస్తీర్ణంలో రూ.276 కోట్లతో టి…హబ్ రెండవ దశ భవనం సిద్ధమైంది. దీనిని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. ఇందులో ఏకకాలంలో రెండు వేలకుపైగా అంకురాల తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా….అన్నిరకాల మౌలిక వసతులు కల్పించారు. ఈ నిర్మాణంతో రెండు వేలకుపైగా అంకురాలు… ఏకకాలంలో కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్. టిహబ్ మొదటి దశకు ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు రాగా… రెండో దశతో ఇన్నోవేషన్ ఎకోసిస్టం మరింతగా బలపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది.

టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా… వినూత్న ఆలోచనలతో వచ్చే స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబరులో టెక్నాలిజీ హబ్‌ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటి క్యాంపస్‌లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. అయితే టి…హబ్ మొదటి దశలో విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఒకేసారి వందకు మించి అంకురాలకు అవకాశం లేకుండా పోయింది. చాలా మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నప్పటికీ స్థలాభావం సమస్యగా మారింది. దీంతో విశాలమైన మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం… టిహబ్ రెండో దశకు శంకుస్థాపన చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడేళ్లలో టి..హబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించారు.

దాదాపు 600 ప్రఖ్యాత కంపెనీలతో కలిసి పనిచేసింది. ఔత్సహికులకు రూ. 18వేల కోట్ల నిధులను సమకూర్చారు. టి..హబ్ అంకురాలతో 2500మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ టి…హబ్ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన విహబ్, డేటా సెంటర్, టి..వర్క్ వంటి వాటికి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీక్యా క్యాపిటల్, యాక్సిల్, కలారి క్యాపిటల్ వంటి వెంచర్ పెట్టుబడిదారులు, యునికార్న్ స్టార్టప్ మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్ కేర్, డెలివరీ వ్యవస్థాపకులతో పాటు మారుతి సుజ్‌కీ, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్‌ఎపి వంటి కార్పొరేట్ దిగ్గజాల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News