Sunday, April 28, 2024

భారత్‌లో ఇకపై టాటా ‘ఐఫోన్లు’

- Advertisement -
- Advertisement -

ముంబై : భారతదేశంలో టాటా గ్రూప్ కూడా ఇకపై యాపిల్ ఐఫోన్లను తయారు చేయనుంది. అంతేకాదు దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఈ ఐఫోన్లను విక్రయించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దీంతో ఐఫోన్లను తయారు చేసే తొలి దేశీయ కంపెనీ టాటా గ్రూప్ కానుంది. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ విస్ట్రాన్‌ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ 125 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా దీనికి తైవాన్ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News