హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాలో ఓటమి చెందిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్లు ఐదుగురు సెంచరీలు చేశారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 800 వరకు పరుగులు చేసినా కూడా ఓటమి చెందడపై విమర్శలు వస్తున్నాయి. జట్టులో ముగ్గురు క్రీడాకారులను మార్చడం అనేది జట్టుకు ఇబ్బందిగా మారిందని క్రికెట్ పండితులు వాపోతున్నారు. బ్యాట్స్మెన్లుగా సాయి సుదర్శన్, మరో బ్యాట్స్మన్ కరుణ్ నాయర్, ఆల్రౌండర్ శార్థూల్ టాకూర్ విఫలం కావడంతో పాటు జట్టుకు భారంగా మారరని విమర్శలు వస్తున్నాయి.
రెండు ఇన్నింగ్స్ లలో ఎనిమిది క్యాచ్ లు వదిలేయడంతోనే ఓటమి కొని తెచ్చుకున్నామని, ఇప్పటికైన ఇంగ్లాండ్ వాతావరణంలో టీమిండియా ఆటగాళ్లకు క్యాచ్ లు పట్టేలా ప్రాక్టీస్ చేయించాలని, జస్ప్రీత్ బుమ్రాకు ఏ బౌలర్ నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియా ఓటమిని చవిచూసిందని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ టెస్టు మ్యాచ్ లకు కోచ్ గా పనికి రాడని, వన్డేలు, టి20లకు మాత్రమే గంభీర్ కోచ్ వ్యవహరించాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రెండో టెస్టుకు అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్ దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో చివరి తొమ్మిది టెస్టు మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలవడంతో ఆయన పదవికే గండం వచ్చిపడింది.
ప్రస్తుతం గంభీర్పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ కోల్పోతే మాత్రం ఆయనను కోచ్ పదవి నుంచి తీసిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద ఆరు మ్యాచ్లు, ఇంగ్లాండ్ మీద ఒక మ్యాచ్ భారత్ ఓడిపోయింది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇండియా ఓటమి చెందింతే మాత్రం గంభీర్ను కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చోప్రా పేర్కొన్నారు. టీమిండియా యజమాన్యం కోరినట్లు సెలక్టర్లు ఆటగాళ్లను ఎంపిక చేశారని, గంభీర్ ఇష్టాను ప్రకారం ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారని, ఫలితాలు రాకుంటే మాత్రం ఆయనకు ఇబ్బంది తప్పకపోవచ్చని హెచ్చరించారు.