Saturday, April 20, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఇండియా

- Advertisement -
- Advertisement -

ఢాకా: షీర్ బంగ్లా జాతీయ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టులో రెండో రోజు భారత జట్టు 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ పది పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 20 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో వెనుదిరిగాడు. ఛటేశ్వరా పూజారా 24 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో మమినల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(18), రిషబ్ పంత్ (12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ 227 పరుగులు చేసి ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News