Thursday, April 25, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఇండియా… 124/2

- Advertisement -
- Advertisement -

 

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 41 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అశ్విన్ 23 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్ ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. తొలి రోజు కెఎల్ రాహూల్ 20 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం నుంచి వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(73), ఛటేశ్వరా పూజారా(06) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News