Sunday, April 28, 2024

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభం అయింది. రాష్ట్రంలో మొత్తం 3,26,799 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 1,62,98,418 కాగా, 1,63,01,705 మహిళా ఓటర్లు ఉన్నారు. 2,676 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 9,99,667 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం ఈవీఎం యంత్రాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 2,00433 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. పోలింగ్ ప్రక్రియను 12,909 మంది మైక్రో అజ్జర్వర్లు పరిశీలించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ తో పివో సహా ఆరుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు. దివ్యాంగుల కోసం 21,686 వీల్ ఛైర్లను అధికారులు సిద్ధం చేశారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారికి ఉతిత రవాణా సదుపాయం కల్పించారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు అందుబాటులో ఉంచారు. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహిస్తున్నారు. 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News