సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ఏర్పాట్లు
వేడుకలకు హాజరుకానున్న సిఎం రేవంత్రెడ్డి ప్రత్యేక
ఆహ్వానితులుగా జపాన్ ప్రతినిధులు జిల్లా కేంద్రాల్లో
అభ్యుదయ రైతులకు నేడు విత్తన కిట్ల పంపిణీ
జిపిఒలకు నియామక పత్రాల అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ వేడుకలను ఈసారి (సోమవారం) పెద్దఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సి ఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకల కు జపాన్కు చెందిన కితాక్యూషు సిటీ మేయర్ కజుహిసాటకేచి తో పాటు ఆయన ప్రతినిధి బృందం ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జపాన్ పర్యటనమకు వెళ్లిన సందర్భంగా వారిని రాష్ట్ర ఆ వతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఇలా ఉండగా రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నది. జిల్లా కేంద్రాలలో నిర్వహించబోయే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆదర్శ రైతులకు విత్తన కిట్లను ప్రభుత్వం అందజేయనున్నది. అలాగే గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాలను అందజేయనున్నది. ఇందిరమ్మ ఇళ్లు, స్పాట్ రిజిస్ట్రేషన్స్ కార్యక్రమాలను కూడా నేటి నుంచే ప్రారంభించబోతున్నది. ‘మిషన్ 26 డేస్ ’ పేరిట కొత్త పథకాలను, కార్యక్రమాలను వేగవంతం చేయనున్నది. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ౩వ తేది నుంచి రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది.
మంత్రులతో సమీక్ష
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేపట్టబోతున్న కొత్త పథకాలు కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మంత్రులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం స్పీడప్ చేయనున్న కార్యక్రమాలపై మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.