Thursday, April 25, 2024

తెలంగాణకు దేశస్థాయిలో పేరు వచ్చింది : పంజాబ్ స్పీకర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్ధార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ సర్ధార్ కుల్తార్ సింగ్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ నిర్వాహణ పనితీరుపై పంజాబ్ స్పీకర్ కు తెలంగాణ స్పీకర్ పోచారం వివరించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిర్వాహణ అత్యుత్తమంగా ఉన్నదని, ప్రజా సమస్యలపై చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పంజాబ్ బృందానికి వివరించారు.

తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికి అద్భుతాలు చేస్తున్నదని దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ ప్రశంసించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరుపున పంజాబ్ స్పీకర్ కి పోచారం శ్రీనివాసరెడ్డి, చైర్మన్ గుతా్త సుఖేందర్ రెడ్డి శాలువాతో సత్కరించి మెమొంటో ను బహూకరించారు. పంజాబ్ రాష్ట్ర స్పీకర్తో పాటుగా ఆ రాష్ట్ర శాసనసభ్యుడు కల్వంత్ సింగ్ పండోరి, మాజీ శాసనసభ్యుడు అమర్ జీత్ సింగ్ ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు‌ గారు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News