కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు నేపథ్యంలో సిఎం రేవంత్రెడ్డితో సిఎస్ రామకృష్ణారావు బుధవారం రాత్రి సమావేశ మయ్యారు. మంత్రులకు శాఖల కేటాయింపునకు సంబంధించి సిఎస్కు సిఎం రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే సిఎం ఆదేశాల మేరకు జిఏడి కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురికి శాఖలను కేటాయించింది. అందులో భాగంగా గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్, కార్మికశాఖలను, అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడలు, యువజన శాఖలను కేటాయిస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు బాధ్యతల స్వీకరణ
శాఖల కేటాయింపు జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులు నేడు బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు సెక్రటేరియట్లోని వారి చాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.