గోదావరి రివర్బోర్డు తీరుపై
తీవ్ర అభ్యంతరం
బనకచర్లపై సమాచారం
ఇవ్వలేదని ఆగ్రహం
బోర్డు చైర్మన్కు ఘాటు లేఖ
రాసిన తెలంగాణ ఇఎన్సి
మన తెలంగాణ/హైదరాబాద్ :గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జిఆర్ఎంబి) వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జి.అనిల్కుమార్ జిఆర్ఎంబి చైర్మన్కు ఘాటుగా లేఖ రా శారు. అందులో కీలక అంశాలను ఈఎన్సీ పొందుపరిచారు. ఏప్రిల్ 7వ తేదీన జరిగిన జిఆర్ఎంబి 17వ సమావేశంలో తీసుకున్న ని ర్ణయాలపై డ్రాఫ్ట్ మినిట్స్లో వచ్చిన అంశాల మధ్య స్పష్టత లేకపోవడంపై అభ్యంతరం వ్య క్తం చేశారు. నాటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ మెంబర్ (టెక్నికల్) లేవనెత్తిన అంశాలను మినిట్స్లో పొందుపరచలేదన్నారు. జిఆర్ఎంబి లో సభ్యులుగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలను సంప్రదించకుండానే సమావేశం తేదీలను ఖరారు చేస్తున్నారని,
సమావేశాల తేదీలను పదేపదే మార్చడం వల్ల తమక పరిపాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర జలశక్తిశాఖకు గోదావరి బోర్డుకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ బనకచర్లపై జనవరిలో కేంద్ర జలశక్తి శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని, అయితే బనకచర్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వకపోవడంలో ఔచిత్యం ఏమిటని లేఖలో ప్రశ్నించారు. గోదావరి బోర్డు మెంబర్ సెక్రెటరీపై బోర్డు ఉద్యోగులు పలు ఆరోపణలు చేసిన విషయం బోర్డు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఈ అంశాలను బోర్డు మినిట్స్లో పొందుపరచకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.